పాపం... నీలం!

ABN , First Publish Date - 2020-05-23T08:11:01+05:30 IST

రాష్ట్రంలోనే ఆమె అత్యంత సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. సుదీర్ఘమైన కెరీర్‌! బదిలీకైనా సిద్ధంకా నీ... వివాదాస్పద నిర్ణయాలు I

పాపం... నీలం!

రంగులపై సీఎస్‌ వివాదాస్పద జీవో

చెల్లదని తెలిసీ మళ్లీ అదే పంథా

ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గారనే అభిప్రాయం

కెరీర్‌ చరమాంకంలో అనుకోని అపప్రథ


(అమరావతి - ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే ఆమె అత్యంత సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. సుదీర్ఘమైన కెరీర్‌! బదిలీకైనా సిద్ధంకా నీ... వివాదాస్పద నిర్ణయాలు తీసుకోరని పేరు! ఇలాంటి ‘ట్రాక్‌ రికార్డ్‌’ ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి తన కెరీర్‌ చివరి దశ లో హైకోర్టు ముందు నిలబడాల్సిన పరిస్థితి వ చ్చింది. గ్రామ సచివాలయాలకు వైసీపీ పతాకంలోని రంగులు ఉండొద్దని కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. నీలం, తెలుపు, ఆకుపచ్చకు తోడు ఎర్రమట్టిరంగును జతచేస్తూ సాహ్ని జీవో 623 జా రీ చేశారు. పార్టీ రంగులు తీసేయాలని హైకోర్టు ఆదేశించగా.. దానికి ఇంకో రంగు జత చేసి మొ త్తం మార్చేశామని అటు కోర్టును, ఇటు ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని అప్పుడే అధికార వర్గాల మధ్య అంతర్గత చర్చ జరిగింది.


ఆ జీవో పర్యవసానం కోర్టులో ఎలా ఉండబోతోందో ముందుగానే అందరూ ఊహించారు. ఇప్పుడు అదే జరిగింది. నీలం సాహ్ని ఈ నెల 28న కోర్టుకు హాజరై వివరణ ఇచ్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రంగుల విషయంలో ఆమె తన సహజశైలికి భిన్నంగా, ప్రభుత్వ పెద్దల ఒ త్తిళ్లకు తలొగ్గి జీవో జారీ చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రంగుల విషయంలో వ్యవహరించిన తీరుపై న్యాయవర్గాలతో సహా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులో ఎవరైనా సవాలు చేస్తే... ప్రభుత్వం తరఫున సంబంధిత అధికారులు వెళ్లి, వివరిస్తారు. ఈ కేసు పూర్తి విచిత్రం. కోర్టు ఆదేశాలను ప్రభుత్వమే అమలు చేయలేదని హైకోర్టు భావించి.. సీఎ్‌సతోపాటు ఇతర అధికారులను వచ్చి వివరణివ్వాలని ఆదేశించింది. 

Updated Date - 2020-05-23T08:11:01+05:30 IST