డిఫిక్ట్స్ నుంచి బయటపడిన నిమ్మగడ్డ రమేష్ కేసు
ABN , First Publish Date - 2020-06-06T13:26:06+05:30 IST
డిఫిక్ట్స్ నుంచి బయటపడిన నిమ్మగడ్డ రమేష్ కేసు
అమరావతి: మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు డిఫిక్ట్స్ నుంచి బయటపడింది. ఎట్టకేలకు ఈ కేసుకు సుప్రీం కోర్టు ఎస్ఎల్పీ నెంబర్ను కేటాయించింది. ఈ కేసుకు ఎస్ఎల్పీ(సివిల్) నెంబర్ 7294/2020గా నమోదు అయ్యింది. వచ్చే వారం ఈ కేసు విచారణకు రానుంది. నిమ్మగడ్డ రమేష్ తొలగింపుపై హైకోర్టు ఆర్డర్ను సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం ఈనెల 1న సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో డిఫెక్ట్స్ క్లియర్ చేయడానికి ప్రభుత్వం ఐదు రోజుల సమయం తీసుకుంది. మొత్తం 13 కేసులకు గాను కేవలం నిమ్మగడ్డ పిటీషన్ ఒక్కదానిలోనే సుప్రీం కోర్టులో అప్పీలు దాఖలు చేసింది.