అర్ధరాత్రి 200 మందితో కూల్చాల్సిన అసరమేంటి..?: చినరాజప్ప

ABN , First Publish Date - 2020-10-24T18:03:26+05:30 IST

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్‌కి చెందిన గీతం సంస్థ కట్టడాల కూల్చివేతలపై

అర్ధరాత్రి 200 మందితో కూల్చాల్సిన అసరమేంటి..?: చినరాజప్ప

విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్‌కి చెందిన గీతం సంస్థ కట్టడాల కూల్చివేతలపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయమై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చినరాజప్ప స్పందించారు. ఇవాళ విజయవాడలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. గీతం వర్సిటీపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చడం దారుణమన్నారు. అర్ధరాత్రి 200 మందితో వచ్చి కూల్చాల్సిన అవసరం ఏంటి? అని చినరాజప్ప ప్రశ్నించారు.


సాయం చేయాలిగానీ..

ఉన్నత విద్యా సంస్థలకు సాయం చేయాలిగానీ, ఇలా చేయడం అన్యాయం. కూల్చివేతలు, కుట్రలు, అక్రమ అరెస్టులే లక్ష్యంగా జగన్ పాలన సాగుతోంది. తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి వికృత చేష్టలకు, వింతపోకడలకు పోతున్నారు’ అని మాజీ మంత్రి ఆరోపించారు. కాగా ఇప్పటికే ఈ విషయంపై నారా లోకేష్, పట్టాభిరామ్‌తో పాటు పలువురు నేతలు స్పందించి అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.

Updated Date - 2020-10-24T18:03:26+05:30 IST