జగన్ నిర్లక్ష్యానికి ప్రజలు భారీ మూల్యం చెల్లిస్తున్నారు: నిమ్మల

ABN , First Publish Date - 2021-05-08T19:22:13+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

జగన్ నిర్లక్ష్యానికి ప్రజలు భారీ మూల్యం చెల్లిస్తున్నారు: నిమ్మల

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ అందరికి అందించలేని ప్రభుత్వ నిర్లక్ష్యంపై పార్టీ పిలుపు మేరకు నిమ్మల నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్ కోవిడ్‌పై నిర్లక్ష్యం వహించినందుకు రాష్ట్ర ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారన్నారు. వైరస్ కట్టడిపై దృష్టి పెట్టవలసిన జగన్ ప్రతిపక్షాన్ని అణిచివేయడం పైనే దృష్టి పెడుతున్నాడని రామానాయుడు విమర్శించారు. కేబినెట్ అజెండాలో కరోనా 33వ అంశంగా పెట్టారంటేనే ప్రజల ప్రాణాలపై జగన్ చిత్తశుద్ధి తెలుస్తుందన్నారు. పొరుగు రాష్ట్రాలు టీకా కొనుగోలుకి పోటీ పడుతుంటే జగన్.. చంద్రబాబుపై కేసుల నమోదుకు పోటీ పడుతున్నాడన్నారు. వ్యాక్సిన్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం 45 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-08T19:22:13+05:30 IST