సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్

ABN , First Publish Date - 2021-05-14T18:30:45+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్

ప.గో. జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అసమర్ధతవల్ల ఏపీ ప్రజలకు పొరుగు రాష్ట్రాల్లోనూ వైద్యం అందడం లేదన్నారు. తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్సులను ఆపితే సీఎం జగన్‌ కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా మాట్లాడలేదని విమర్శించారు. జగన్‌కు కేసీఆర్‌ చేసిన ఎన్నికల సాయంతో ప్రశ్నించలేని పరిస్థితి నెలకొందన్నారు. నాణ్యమైన వైద్యం అందక అమరావతి లేని లోటు ప్రజలకు తెలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనల ఖర్చు కంటే కొవిడ్ ఖర్చు తక్కువగా ఉందని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

Updated Date - 2021-05-14T18:30:45+05:30 IST