నిమ్స్లో వెంటిలేటర్ల కోసం.. 42 లక్షలిచ్చిన మెఘా ఇంజనీర్స్
ABN , First Publish Date - 2020-03-30T10:21:24+05:30 IST
నిమ్స్ ఆస్పత్రిలో రోగుల కోసం అదనపు వెంటిలేటర్లు సమకూర్చుకునేందుకు మెఘా ఇంజనీర్స్ రూ. 41.95 లక్షల విరాళం అందజేసింది. ఈ మేరకు ఆ సంస్థ
వెంకటేశ్వరకాలనీ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): నిమ్స్ ఆస్పత్రిలో రోగుల కోసం అదనపు వెంటిలేటర్లు సమకూర్చుకునేందుకు మెఘా ఇంజనీర్స్ రూ. 41.95 లక్షల విరాళం అందజేసింది. ఈ మేరకు ఆ సంస్థ అధినేత మెఘా కృష్ణారెడ్డి తరఫున ప్రతినిధులు.. ఆదివారం నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ మనోహర్ను కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్కు మెఘా కృష్ణారెడ్డి ఓ లేఖను పంపారు. కరోనాను కట్టడి చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నిమ్స్లో సేవలందిస్తున్న వైద్యసిబ్బంది రాకపోకలకోసం 6 మార్గాల్లో రవాణా సదుపాయం కల్పిస్తున్నామని మెఘా ఇంజనీర్స్ ప్రతినిధి సారథి తెలిపారు. గతంలోనూ నిమ్స్లో కేన్సర్ వార్డు పునర్నిర్మాణానికి మెఘా ఇంజనీర్స్ రూ. 10 కోట్లు అందజేసింది.