ఎట్టకేలకు మాట నెగ్గించుకున్న ఎమ్మెల్యే రోజా
ABN , First Publish Date - 2021-10-08T21:25:00+05:30 IST
నిండ్ర మండలంలో వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక ఎట్టకేలకు పూర్తి అయింది.
చిత్తూరు జిల్లా: నగరి నియోజకవర్గం పరిధిలోని నిండ్ర మండలంలో వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక ఎట్టకేలకు పూర్తి అయింది. వైసీపీ అధిష్టానం వద్ద ఎమ్మెల్యే రోజా మాటే చెల్లుబాటు అయింది. దీంతో రోజా సూచించిన దీపను ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే వైస్ ఎంపీపీగా దుర్గా భవానీని ఎన్నుకున్నారు. నిండ్ర ఎంపీపీగా, వైస్ ఎంపీపీగా ఎన్నికైన వారితోపాటు ఎంపీటీసీ సభ్యులను రోజా సన్మానించారు. సీఎం జగన్ ఆదేశానుసారం ఎంపీపీ ఎన్నిక జరిగిందని ఆమె తెలిపారు.