గుబ్బల మంగమ్మ గుడికి భక్తులతో వెళుతున్న వ్యాన్ బోల్తా

ABN , First Publish Date - 2020-02-19T15:37:41+05:30 IST

పశ్చిమ గోదావరి: గుబ్బల మంగమ్మ గుడికి భక్తులతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం- అక్కంపేట మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

గుబ్బల మంగమ్మ గుడికి భక్తులతో వెళుతున్న వ్యాన్ బోల్తా

పశ్చిమ గోదావరి: గుబ్బల మంగమ్మ గుడికి భక్తులతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం- అక్కంపేట మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను ఏలూరుకు తరలించారు. ప్రమాద సమయంలో వ్యానులో 22 మంది భక్తులున్నారు. భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామం నుంచి వీరంతా గుబ్బల మంగమ్మ గుడికి వెళ్తున్నారు. 

Updated Date - 2020-02-19T15:37:41+05:30 IST