కేరళలో మద్యం దొరక్క 9 మంది మృతి

ABN , First Publish Date - 2020-03-30T18:24:57+05:30 IST

కేరళలో మద్యం దొరక్కపోవడంతో తొమ్మిది మంది మృతి చెందారు.

కేరళలో మద్యం దొరక్క 9 మంది మృతి

తిరువనంతపురం: కేరళలో మద్యం దొరక్కపోవడంతో తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఆరుగురు మందుబాబులు ఆత్మహత్యాయత్నం చేశారు. దీనిపై స్పందించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మాట్లాడుతూ.. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ ఉన్నవారికే మద్యం ఇవ్వాలని ఎక్సైజ్‌శాఖను ఆదేశించారు. మద్యానికి బానిసైన వారిని డి- అడిక్షన్‌ సెంటర్‌లకు పంపాలని సూచించారు. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలను పరిశీలిస్తున్నామని సీఎం విజయన్‌ అన్నారు.

Updated Date - 2020-03-30T18:24:57+05:30 IST