న్యూ ఇయర్ పార్టీలో యువతి హత్య

ABN , First Publish Date - 2021-01-02T17:43:22+05:30 IST

కొత్త సంవత్సరం సందర్భంగా ముంబై నగరంలోని ఓ అపార్టుమెంటులోని 16వ అంతస్తులో జరిగిన విందు సందర్భంగా జరిగిన గొడవ ఓ యువతి హత్యకు...

న్యూ ఇయర్ పార్టీలో యువతి హత్య

ముంబై (మహారాష్ట్ర): కొత్త సంవత్సరం సందర్భంగా ముంబై నగరంలోని ఓ అపార్టుమెంటులోని 16వ అంతస్తులో జరిగిన విందు సందర్భంగా జరిగిన గొడవ ఓ యువతి హత్యకు దారితీసింది. ముంబై నగరంలోని ఖార్ వెస్ట్ ప్రాంతంలోని ఎతైన భవనంపైన కొత్త సంవత్సరం సందర్భంగా విందు చేసుకుంటున్నారు. ఈ విందులో ఓ యువతీయువకుడు కలిసి ఉండగా, పార్టీకి హాజరైన ఓ యువతి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో వారి మధ్య రేగిన వాదన హత్యకు దారి తీసింది. ఈ విందులో పాల్గొన్న 19 ఏళ్ల వయసుగల యువతిని ఇద్దరు యువకులు హతమార్చారు. 


ముంబై నగరంలో న్యూఈయర్ పార్టీలపై నిషేధం ఉన్నా, విందు ఎలా ఏర్పాటు చేశారని, యువతి హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువతి జుట్టు పట్టుకొని కొట్టడంతో తలపై గాయమైందని దీంతో మరణించిందని పోలీసులు చెప్పారు. పోలీసులు పార్టీ నిర్వాహకుడితోపాటు విందులో పాల్గొన్న వారిని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2021-01-02T17:43:22+05:30 IST