afghanistan: 94 మంది తాలిబన్, అల్ ఖైదా ఉగ్రవాదుల హతం
ABN , First Publish Date - 2021-08-06T17:27:39+05:30 IST
అప్ఘనిస్థాన్ దేశంలో గత 24 గంటల్లో జరిగిన భద్రతా బలగాల దాడుల్లో 94 మంది తాలిబన్, అల్ ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు....
కాబూల్ (అప్ఘనిస్థాన్) : అప్ఘనిస్థాన్ దేశంలో గత 24 గంటల్లో జరిగిన భద్రతా బలగాల దాడుల్లో 94 మంది తాలిబన్, అల్ ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు. లష్కర్ గహ్ నగరంలో గత 24 గంటల్లో భద్రతాబలగాలు జరిపిన దాడుల్లో 94 మంది హతమయ్యారని ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. తాలిబన్లకు, ఆఫ్ఘాన్ భద్రతా బలగాల మధ్య హెల్మాండ్ ప్రావిన్సులో గత వారం భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తాలిబన్ రెడ్ యూనిట్ కమాండర్ మావ్లాయి ముబారక్ మరణించాడు.94 మంది ఉగ్రవాదులు మరణించగా, మరో 16 మంది గాయపడ్డారు. ఆఫ్ఘాన్ ఉగ్రదాడుల్లో ఈ ఏడాది 1659 మంది పౌరులు మరణించగా, మరో 3,254 మంది గాయపడ్డారు.