చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేసిన నైనిటాల్ హైకోర్టు
ABN , First Publish Date - 2021-07-29T01:35:51+05:30 IST
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో చార్ధామ్ యాత్రను
నైనిటాల్ : కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో చార్ధామ్ యాత్రను ఆగస్టు 18 వరకు నిలిపేస్తూ నైనిటాల్ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఈ దేవాలయాల్లో కోవిడ్ సంబంధిత మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేయడంలేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని విమర్శించింది.
చార్ధామ్ దేవాలయాలకు ప్రతి సంవత్సరం దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. కోవిడ్ నేపథ్యంలో కేవలం చమోలీ, రుద్ర ప్రయాగ, ఉత్తర కాశీ వాసులకు మాత్రమే ఈ దేవాలయాల సందర్శనకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఇదిలావుండగా, ఉత్తరాఖండ్లో ఆగస్టు 1 నుంచి ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు పాఠశాలలను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలో మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.