Nipah Virus: కడగని పండ్లు తింటే ప్రాణాంతకం: ఎయిమ్స్ నిపుణులు!

ABN , First Publish Date - 2021-09-07T15:17:54+05:30 IST

కేరళలో నిఫా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన...

Nipah Virus: కడగని పండ్లు తింటే ప్రాణాంతకం: ఎయిమ్స్ నిపుణులు!

న్యూఢిల్లీ: కేరళలో నిఫా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన 12 ఏళ్ల బాలునితో టచ్‌లో ఉన్న 251 మంది వ్యక్తులను కేరళ వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. వీరిలో 38 మందిని కోజికోడ్ మెడికల్ కాలేజీ  ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ అశుతోష్ బిశ్వాస్... నిఫా వైరస్‌కు సంబంధించిన పలు విషయాలు తెలిపారు. 


గబ్బిలాల కారణంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని  అన్నారు. గబ్బిలాలు సామూహికంగా ఒకచోట ఉంటాయని, ఇదేవిధంగా అవన్నీ మరోచోటుకి తరలివెళతాయని, ఫలితంగా వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపారు. నిఫా వైరస్‌ను అరికట్టేందుకు ఇంతవరకూ మనదగ్గర తగిన ఔషధం లేదని, ఈ వైరస్ సోకిన బాధితులకు ప్రాణాపాయం ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. ఈ వైరస్ గబ్బిలా నుంచి పందులు, గొర్రెలు తదితర జంతువులకు సోకుతుందని తరువాత అది మనుషులకు వ్యాపిస్తుందన్నారు. కొండకోనల నుంచి వచ్చే పండ్లను శుభ్రంగా కడిగిన తరువాతనే తినాలని, లేదంటే ఆరోగ్యానికి హాని కలిగే అవకాశాలున్నాయన్నారు. ప్రస్తుతానికి కేరళ, పశ్చిమ బెంగాల్‌లో నిఫా వైరస్ కేసులు కనిపించాయన్నారు. 

Updated Date - 2021-09-07T15:17:54+05:30 IST