ఎస్సీలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-12-05T04:34:40+05:30 IST
ఎస్సీ, ఎస్టీలకు చెందాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తూ ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మాలమహాసేన జాతీయ అధ్యక్షుడు అలగ రవికుమార్ ఆరోపించారు.
ఏలూరు ఫైర్స్టేషన్, డిసెంబరు 4 : ఎస్సీ, ఎస్టీలకు చెందాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తూ ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మాలమహాసేన జాతీయ అధ్యక్షుడు అలగ రవికుమార్ ఆరోపించారు. పాతబస్టాం డ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం పూల మాలలు వేసి నివాళు లర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రావాల్సిన నిధులను సాధించడంలో విఫలమయ్యారన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులను సాధించడానికి ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తేవడానికి మాలమహాసేన ధర్మ పోరాట యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమాలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరికపాటి విజయ్, రాష్ట్ర కో ఆర్డినేటర్ నూకపెయ్యి కార్తీక్, జిల్లా అధ్యక్షుడు కొమ్మిని అగస్టీన్, ప్రధాన కార్యదర్శి కాపుదాసి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.