Telangana: ప్రియుడి మోసం..కుమార్తెతో వివాహిత ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-08-26T13:26:17+05:30 IST

జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడు మోసం చేశాడంటూ తీవ్ర మనస్థాపానికి గురైన ఓ

Telangana: ప్రియుడి మోసం..కుమార్తెతో వివాహిత ఆత్మహత్యాయత్నం

నిర్మల్: జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడు మోసం చేశాడంటూ తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వివాహిత తన కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మూడేళ్ల  కూతురికి విషం తాగించి, తాను పురుగుల మందు సేవించి బలవన్మరణానికి యత్నించింది. ఈ ఘటనలో చిన్నారి క్యూటీ మృతి చెందగా...తల్లి పరిస్థితి విషమంగా ఉంది. భర్తను వదిలేసిన వివాహిత ఈ నెల 22న ప్రియుడు శ్రీకాంత్ రెడ్డితో వెళ్లి పోయింది. కాగా శ్రీకాంత్ మోసం చేయడంతో జిల్లా కేంద్రంలోని లాడ్జిలో ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. బాధితుల స్వగ్రామం సారంగా పూర్ మండలం బొరి గాంగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు లాడ్జికి చేరుకుని వివాహితను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు వివాహిత వెళ్లిపోవడంతో అవమానానికి గురైన ఆమె భర్త ఊరు నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-08-26T13:26:17+05:30 IST