Nirmalలో ప్రైవేటు బస్సు బోల్తా

ABN , First Publish Date - 2021-11-03T13:33:08+05:30 IST

జిల్లాలోని కొండాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

Nirmalలో ప్రైవేటు బస్సు బోల్తా

నిర్మల్: జిల్లాలోని కొండాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 16మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారిని వెంటనే నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదరాబాద్ నుంచి యూపీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-03T13:33:08+05:30 IST