బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్న నిర్మలా సీతారామన్

ABN , First Publish Date - 2020-10-22T01:58:27+05:30 IST

బీజేపీ మేనిఫెస్టోలో 'ఆత్మనిర్భర్ భారత్' కీలక అంశంగా ఉండనుంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ...

బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్న నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారంనాడు పాట్నాలో విడుదల చేయనున్నారు. బీజేపీ మేనిఫెస్టోలో 'ఆత్మనిర్భర్ భారత్' కీలక అంశంగా ఉండనుంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతామని బీజేపీ ఈ మేనిఫెస్టోలో హామీ ఇవ్వనుంది. ఆత్మనిర్భర్ భారత్‌తో బీహార్‌లో పారిశ్రామికీకరణకు మార్గం మరింత సుగగమవుతుందని చెప్పనుంది. 'స్వయం సమృద్ధ వ్యవసాయ రంగం' అనేది బీజేపీ మేనిఫెస్టోలో మరో కీలకాశం. విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వనునున్నట్టు కూడా మేనిఫెస్టోలో చెప్పనుంది. నూతన విద్యావిధానంతో దేశంలో ముఖ్యంగా రాష్ట్ర విద్యార్థులకు ఎంత మేలు జరగనుందో వివరించనుంది. కాగా, బీహార్‌లో ఆర్జేడీ సారథ్యంలోని కాంగ్రెస్, వామపక్షాల మహాకూటమి ఇటీవల సంయుక్తంగా మేనిఫెస్టో విడుదల చేయగా, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ బుధవారంనాడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘బిహార్ ఫస్ట్... బిహారీ ఫస్ట్’ అన్న నినాదంతో ఎల్జేపీ సొంతంగా ఈసారి ఎన్నికలను ఎదుర్కొంటోంది.

Updated Date - 2020-10-22T01:58:27+05:30 IST