విశాఖకు నిర్మలా సీతారామన్... ఆందోళనకు దిగిన స్టీల్ ప్లాంట్ కార్మికులు
ABN , First Publish Date - 2021-08-06T23:39:22+05:30 IST
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుండి పోర్ట్ గెస్ట్ హౌస్కి ఆమె వెళ్లారు. నిర్మలా సీతారామన్
విశాఖ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుండి పోర్ట్ గెస్ట్ హౌస్కి ఆమె వెళ్లారు. నిర్మలా సీతారామన్, విశాఖ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిర్మలా సీతారామన్ను అడ్డుకునేందుకు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎయిర్పోర్ట్ దగ్గరకు చేరుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్పరం చేయొద్దని కార్మికుల డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. నిర్మలా సీతారామన్ నేడు పోర్ట్ గెస్ట్ హౌస్ విశ్రాంతి తీసుకుంటారు. రేపు జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొనేందుకు శ్రీకాకుళం జిల్లా పొందూరు వెళతారు. అక్కడ మధ్యాహ్నం భోజనాలు ముగిశాక 3 గంటలకు బయలుదేరి విశాఖపట్నం వస్తారు. ఇక్కడి నుంచి సాయంత్రం 5.55 గంటలకు ఢిల్లీ వెళతారు.