నేడు పీఎస్‌బీ చీఫ్‌లతో నిర్మల భేటీ

ABN , First Publish Date - 2020-05-22T07:01:21+05:30 IST

ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) సారథులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం సమావేశం కానున్నారు. కరోనా కల్లోలంతో కుదేలైన జీడీపీకి ఊతమిచ్చేందుకు జరుగుతున్న రుణ వితరణ ప్రయత్నాలతోపాటు...

నేడు పీఎస్‌బీ చీఫ్‌లతో నిర్మల భేటీ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) సారథులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం సమావేశం కానున్నారు. కరోనా కల్లోలంతో కుదేలైన జీడీపీకి ఊతమిచ్చేందుకు జరుగుతున్న రుణ వితరణ ప్రయత్నాలతోపాటు పలు అంశాలను మంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా సమీక్షించనున్నారు. వాస్తవానికి ఈ నెల 11న వారితో మంత్రి భేటీ కావాల్సింది. ఉద్దీపనల ప్యాకేజీని విడతలవారీగా ప్రకటించాల్సి రావడంతో ఇది వాయిదా పడింది.

Updated Date - 2020-05-22T07:01:21+05:30 IST