27న నిట్ భవనాలు ప్రారంభం
ABN , First Publish Date - 2020-10-25T15:32:33+05:30 IST
ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాశ్వత క్యాంపస్ ఫేజ్-1ఎ భవన సముదాయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి..
రిమోట్ సెన్సింగ్తో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి
(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాశ్వత క్యాంపస్ ఫేజ్-1ఎ భవన సముదాయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ప్రొక్రియాల్ ప్రారంభించనున్నారు. అక్టోబరు 27వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ నుంచే రిమోట్ సెన్సింగ్ ద్వారా నిట్ భవనాలను ప్రారంభిస్తారు. ఫేజ్-1ఎలో దాదాపు రూ. 206 కోట్లతో నిర్మించిన అకడమిక్ భవనాలు, హాస్టల్స్, స్టాప్ క్వార్టర్స్, లేబోరేటరీ కాంప్లెక్స్, వర్క్షాప్ భవనాలు ఉన్నాయి. కేంద్ర మంత్రి ప్రొక్రియాల్ ఫేజ్-1ఎ భవన సముదా యాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మరో రూ. 196 కోట్లతో ఫేజ్-1బి పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అందరికీ హాస్టల్ వసతి సమకూర్చేలా శాశ్వత క్యాంపస్ సిద్ధమైంది.