వలసలు అనడం తప్పు: నితీష్ ఫైర్

ABN , First Publish Date - 2020-06-05T00:02:17+05:30 IST

కోవిడ్-19 నేపథ్యంలో బీహార్‌కు తిరిగి వచ్చిన వారందరికీ ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని బీహార్ ముఖ్యమంత్రి..

వలసలు అనడం తప్పు: నితీష్ ఫైర్

పాట్నా: కోవిడ్-19 నేపథ్యంలో బీహార్‌కు తిరిగి వచ్చిన వారందరికీ ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. వర్కర్లను 'వలసలు' అని పిలవడంపై నితీష్ మండిపడ్డారు.


'ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానిక ప్రజలు వెళుతుంటే వారిని ప్రవాసీ (వలసలు) అంటున్నారు. ఎందుకు? ఇది ఒకే దేశం, ఒకే జాతీయత. ఈ దేశంలోని వాళ్లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళితే వారిని వలసలు అనరు. దేశం బయటకు వెళితేనే వాళ్లని వలసలు అంటారు' అని నితీష్ గురువారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చిన ప్రజలు కేవలం నిస్సహాయత కారణంగా ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదని, వారికి ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖలన్నీ అదే పనిపై ఉన్నాయని నితీష్ తెలిపారు.

Updated Date - 2020-06-05T00:02:17+05:30 IST