నివర్ తూఫాన్: తూ.గో.జిల్లాలో కుప్పకూలిన ఆలయం
ABN , First Publish Date - 2020-11-26T20:46:22+05:30 IST
నివర్ తుఫాన్ ప్రభావంతో పిఠాపురం నియోజకవర్గంలో రాత్రి నుండి ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తోంది.
తూ.గో.జిల్లా: నివర్ తుఫాన్ ప్రభావంతో పిఠాపురం నియోజకవర్గంలో రాత్రి నుండి ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తోంది. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరం వెంబడి అలలు ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ శివారు సూరాడపేట వద్ద ఏడేళ్ల కిందట నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయం అలలు తాకిడికి కూప్పకూలింది. గత నెల చివరి వారంలో ఏర్పడ్డ తుపాను సమయంలో తీరం భారీగా కోతకు గురై పాక్షికంగా గుడి దెబ్బతింది. ఇప్పుడు నివర్ తూఫాన్ కారణంగా అలల తాకిడికి ఇవాళ ఆలయం పూర్తిగా కుప్పకూలింది. తరచు సముద్రం కోతలకు గురి కావడంతో తీరప్రాంత గంగ పుత్రులు ఆందోళన చెందుతున్నారు.