‘నడయాడిన దేవుడి’ కథ!

ABN , First Publish Date - 2020-07-03T06:25:26+05:30 IST

‘నడయాడిన దేవుడి’ కథ!

‘నడయాడిన దేవుడి’ కథ!

కాశీ క్షేత్రంలో ఒకప్పుడు ‘నడయాడే విశ్వనాథుడి’గా ఖ్యాతి పొందిన మహాపురుషుడు, సాధకుడు -  శ్రీ త్రైలింగ స్వామి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో జన్మించిన ఆయన వారణాసిని తన కార్యక్షేత్రంగా చేసుకున్నారు. త్రిలింగదేశంగా ఖ్యాతి పొందిన తెలుగు నేలకు చెందిన వ్యక్తి గనుక త్రైలింగ స్వామిగా ప్రసిద్ధులయ్యారు. ఆయన దాదాపు 280 సంవత్సరాలు జీవించినట్టు కథనాలు ఉన్నాయి. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుడితో సహా ఎంతోమంది ప్రఖ్యాతులు త్రైలింగ స్వామిని దర్శించుకున్నారు. విదేశీయులు సైతం ఆయన గురించి తమ రచనల్లో ప్రస్తావించారు. త్రైలింగ స్వామి గురించి అనేక పుస్తకాలు వివిధ భాషల్లో వెలువడ్డాయి.  తాజాగా జక్కా విజయకుమారి రచించిన పుస్తకం ‘శ్రీ త్రైలింగ స్వామి దివ్య చరిత్ర’. దీనిలో స్వామి జీవిత చరిత్రతో పాటు అనుబంధంగా ఆయన చేసిన ద్వాదశ తత్త్వోపదేశాలను రచయిత్రి అనుబంధంగా ఇచ్చారు.


శ్రీ త్రైలింగ స్వామి దివ్యచరిత్ర

రచన: విజయకుమారి జక్కా

పేజీలు: 184, వెల: రూ. 100

ప్రచురణ: శ్రీ అనిమిష భగవాన్‌ ఛారిటబుల్‌ సొసైటీ, ప్రతులకు: పి. ఈశ్వరమ్మ, గుంటూరు, ఫోన్‌ నెంబర్‌: 97037 77306

Updated Date - 2020-07-03T06:25:26+05:30 IST