Nizamabad: అనుమానంతో భార్యను, కూతురిని గొడ్డలితో నరికి చంపిన భర్త

ABN , First Publish Date - 2021-07-23T14:27:58+05:30 IST

జిల్లాలో దారుణ హత్య జరిగింది. భార్య, కూతురిని అతికిరాతకంగా హత్య చేసాడు భర్త. ఈ ఘటన శుక్రవారం రుద్రుర్ మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. భార్య

Nizamabad: అనుమానంతో భార్యను, కూతురిని గొడ్డలితో నరికి చంపిన భర్త

నిజామాబాద్: జిల్లాలో దారుణ హత్య జరిగింది. భార్య, కూతురిని అతికిరాతకంగా హత్య చేసాడు భర్త. ఈ ఘటన శుక్రవారం రుద్రుర్ మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. భార్య (మల్లీశ్వరి)పై అనుమానం పెంచుకున్నాడు భర్త (గంగాధర్). గత కొన్ని రోజులుగా అనుమానంతో భార్యను చిత్ర హింసలు పెట్టేవాడు. అయితే..గురువారం భార్యభర్తల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. మల్లీశ్వరిపై ఆగ్రహానికి గురైన గంగాధర్ ఇంట్లో ఉన్న గొడ్డలితో తలపై భార్య మల్లీశ్వరి (30), కూతురు రుత్విక (13)ను అతికిరాతకంగా నరికి హత్య చేశాడు. నిందితుడు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-07-23T14:27:58+05:30 IST