నిజామాబాద్లో లారీ దగ్ధం
ABN , First Publish Date - 2020-03-12T15:53:39+05:30 IST
నిజామాబాద్లో లారీ దగ్ధం
ముప్పాల్: నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం కొత్తపల్లి వద్ద పసుపు లోడ్తో వెళ్తున్న లారీ దగ్ధమైంది. డీజిల్ ట్యాంక్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.