3వేల టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయన్న వార్త అవాస్తవం: జీఎస్ఐ
ABN , First Publish Date - 2020-02-23T02:07:58+05:30 IST
ఉత్తర్ప్రదేశ్లోని సోన్భాద్రాలో బంగారు నిల్వలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలు అవాస్తమని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శనివారం స్పష్టం చేసింది. బంగారు
కోల్కతా: ఉత్తర్ప్రదేశ్లోని సోన్భాద్రాలో బంగారు నిల్వలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలు అవాస్తమని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శనివారం స్పష్టం చేసింది. బంగారు నిల్వలు గురించి జరిపిన అన్వేషణలో ఫలితం ప్రతికూలంగా వచ్చిందని పేర్కొంది.
క్లారిటీ వచ్చేసింది!
‘‘మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం.. సొన్భాద్రాలో బంగారు నిల్వలు లేవు. ఎన్నో ఖనిజాలు దొరికే ఈ ప్రాంతంలో ప్రతీ టన్నుకు 3.03 గ్రాముల బంగారం వెలువడుతుంది. అంటే ఇక్కడ మొత్తం 52,806.25 టన్నుల ముడి ఖనిజం వెలువడితే అందులో నుంచి 160 కిలోల బంగారం వస్తుంది. కానీ, మీడియా చెప్పినట్లు 3,350 టన్నులు కాదు’’ అని జీఎస్ఐ డైరెక్టర్ జనరల్ ఎం శ్రీధర్ తెలిపారు.