ఓటరు మనసును ఎవరూ మార్చలేరు: అనురాధ

ABN , First Publish Date - 2020-07-02T16:14:02+05:30 IST

వైసీపీ ప్రభుత్వం క్లౌడ్ 9లో ఉందని, రాష్ట్రం వాళ్ల సొంత జాగీరుదారు అనుకుంటోందని..

ఓటరు మనసును ఎవరూ మార్చలేరు: అనురాధ

అమరావతి: వైసీపీ ప్రభుత్వం క్లౌడ్ 9లో ఉందని, రాష్ట్రం వాళ్ల సొంత జాగీరుదారు అనుకుంటోందని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మొత్తాన్ని ప్రభుత్వం గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తోందని, పీకేకు అప్పగించేందుకు చూస్తోందని,  2024లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే ‘వలంటీర్ల’ వ్యూహం రచిస్తోందన్న దానిపై ఆమె మాట్లాడుతూ వాలంటీర్లను గుప్పిట్లోకి తెచ్చుకున్నంత మాత్రాన ఓటరు మనసును ఎవరూ మార్చలేరని అన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడును ఎవరూ వ్యతిరేకించలేదని, ఒక్క చాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పి జగన్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. ఇంతవరకు ప్రజలు ఎవరూ చంద్రబాబుపై వ్యతిరేకంగా మాట్లాడలేదని అనురాధ అన్నారు. ఇప్పుడున్న నాయకుల్లా బాబు జైలుకు వెళ్లలేదన్నారు. కోవిడ్‌పై చంద్రబాబు చేసిన సూచనలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాటించారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తప్పులను సరిదిద్దుకోవాలని, పదవులు శాశ్వతం కాదన్న విషయం తెలుసుకోవాలని అనురాధ సూచించారు.


Updated Date - 2020-07-02T16:14:02+05:30 IST