మననెవరూ తగ్గించ లేరు: చిరాగ్ పాశ్వాన్

ABN , First Publish Date - 2020-10-01T01:34:40+05:30 IST

పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని పోరాడేందుకు సిద్ధంగా ..

మననెవరూ తగ్గించ లేరు: చిరాగ్ పాశ్వాన్

న్యూఢిల్లీ: పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని లోక్ ‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ఉనికిని లేకుండా చేయడం కానీ, అణిచి వేయడం కానీ, తగ్గించడం కానీ చేయలేరని అన్నారు. బుధవారంనాడు తన నివాసంలో పార్టీ సభ్యులు, కార్యకర్తలతో చిరాగ్ మాట్లాడారు.


'మొట్టమొదట దేశం, ఆ తరువాత పార్టీ, ఆ తర్వాతే మనం...అని నాన్నగారు (రామ్ విలాస్ పాశ్వాన్) ప్రతి పార్టీ సమావేశంలోనూ, ర్యాలీల్లోనూ మనకు చెబుతుంటారు. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మనం నిర్ణయాలు తీసుకుంటాం. పార్టీ మనకు తల్లిలాంటిది. దానిని పటిష్టం చేసుకుంటాం. పార్టీ ప్రతిష్టను దిగజార్చగలమని కానీ, ఉనికి లేకుండా చేస్తామని కానీ ఎవరైనా అనుకుంటే అది అసాధ్యం' అని చిరాగ్ పేర్కొన్నారు. బీహార్‌లో ఎల్‌జేపీని ఎవరూ ఆపలేరనీ, దేశంలోని ఏ పార్టీ కూడా ఆ పని చేయలేదని అన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పోరాటానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తల్లో చిరాగ్ ఉత్సాహం నింపారు.

Updated Date - 2020-10-01T01:34:40+05:30 IST