సౌతాఫ్రికాకు హామీ ఇవ్వలేదు
ABN , First Publish Date - 2020-05-23T09:20:45+05:30 IST
వచ్చే ఆగస్టులో సౌతాఫ్రికాలో భారత క్రికెట్ జట్టు పర్యటన కోసం సఫారీ క్రికెట్ బోర్డు (సీఎస్ఏ)కు ఎలాంటి హామీ ఇవ్వలేదని బీసీసీఐ స్పష్టంజేసింది
న్యూఢిల్లీ: వచ్చే ఆగస్టులో సౌతాఫ్రికాలో భారత క్రికెట్ జట్టు పర్యటన కోసం సఫారీ క్రికెట్ బోర్డు (సీఎస్ఏ)కు ఎలాంటి హామీ ఇవ్వలేదని బీసీసీఐ స్పష్టంజేసింది. ఆ టూర్కు సంబంధించి కేవలం చర్చలే జరిగినట్టు వెల్లడించింది. తమ దేశంలో భారత జట్టు పర్యటించనున్నట్టు సీఎస్ఏ ప్రకటించడాన్ని బోర్డు కార్యదర్శి అరుణ్ ధూమల్ శుక్రవారం ఖండించారు. ‘కరోనా వైరస్తో భారత్లో దక్షిణాఫ్రికా పర్యటన అర్ధంతరంగా నిలిచిపోయింది. పరిస్థితులు అనుకూలిస్తే భవిష్యత్లో టీమిండియా పర్యటించే విషయమై అప్పట్లో చర్చ జరిగింది. అంతేతప్ప ఆ టూర్కు మేం హామీ ఇవ్వలేదు’ అని అరుణ్ వివరించారు.