అబ్బే.. అలాంటి ప్రతిపాదనేదీ లేదు: యడియూరప్ప
ABN , First Publish Date - 2020-07-14T02:44:00+05:30 IST
పెరుగుతున్న కొవిడ్ కేసులకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నెల 14 నుంచి బెంగళూరు పట్టణ, గ్రామీణ జిల్లాల్లో వారం
బెంగళూరు: పెరుగుతున్న కొవిడ్ కేసులకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నెల 14 నుంచి బెంగళూరు పట్టణ, గ్రామీణ జిల్లాల్లో వారం రోజులపాటు లాక్డౌన్ను విస్తరించనున్నట్టు వస్తున్న వార్తలపై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పందించారు. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలని, పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22 వరకు లాక్డౌన్ను పొడిగిస్తారంటూ వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వాటికి చెక్ పెట్టారు. లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉందని కొందరు మంత్రులు సూచన ప్రాయంగా చెప్పడంతో పుకార్లు ఊపందుకున్నాయి. దీంతో స్వయంగా ముఖ్యమంత్రే వీటిపై స్పందించాల్సి వచ్చింది.