తాలిబన్లతో చర్చలు జరపట్లేదు: ఐరోపా సమాఖ్య
ABN , First Publish Date - 2021-08-22T01:52:38+05:30 IST
అఫ్ఘానిస్థాన్లో తాలిబన్ల పాలనను తాము గుర్తించలేదని ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ అర్సులా వాన్ డెర్ లియన్ తాజాగా పేర్కొన్నారు.
బ్రస్సెల్స్: అఫ్ఘానిస్థాన్లో తాలిబన్ల పాలనను తాము గుర్తించలేదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు అర్సులా వాన్ డెర్ లియన్ తాజాగా పేర్కొన్నారు. తాలిబన్లతో ప్రస్తుతం ఎటువంటి చర్చలు జరపట్లేదని కూడా ఆమె స్పష్టం చేశారు. అఫ్ఘానిస్థాన్ నుంచి తిరిగొచ్చిన ఐరోపా సమాఖ్య ఉద్యోగుల కోసం మాడ్రిడ్ నగరంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆమె నేడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానవతా ధృక్పథంతో అఫ్ఘానిస్థాన్కు అందిస్తున్న సాయాన్ని మరింత పెంచాలని అభిప్రాయపడ్డారు. అయితే అఫ్ఘానిస్థాన్లో మహిళహక్కుల పరిరక్షణ, మైనారిటీల భద్రత ఎంత వరకూ ఉందనేదానిపై ఆ దేశానికి అందే నిధులు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.