ఏపీలో ఎక్కడా ఎరువుల కొరత లేదు: కన్నబాబు
ABN , First Publish Date - 2021-10-08T22:09:23+05:30 IST
ఏపీలో ఎక్కడా ఎరువుల కొరత లేదని మంత్రి కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో
అమరావతి: ఏపీలో ఎక్కడా ఎరువుల కొరత లేదని మంత్రి కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక వసతులపై సీఎం సమీక్షించారని తెలిపారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని దుష్ర్పచారం జరుగుతోందని, నాణ్యతతో కూడిన ఎరువుల మందులు ఇవ్వడమే రైతు భరోసా కేంద్రాల లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల పంపిణీతో డీలర్ల కడుపు కొడుతున్నామన్న ఆరోపణలు సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఎరువుల ఉత్పత్తి తగ్గిందని కన్నబాబు తెలిపారు.