ప్రత్యేక పరీక్షలు అవసరం లేదు

ABN , First Publish Date - 2021-11-24T13:55:52+05:30 IST

ప్రత్యేక పరీక్షలను..

ప్రత్యేక పరీక్షలు అవసరం లేదు

ఇంటర్‌ బోర్డు


హైదరాబాద్‌, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక పరీక్షలను నిర్వహించే అవసరం లేదని ఇంటర్‌ బోర్డు స్పష్టతనిచ్చింది. పరీక్షల సమయంలో కరోనాతో బాధపడిన వారు ఎవరూ లేకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ తెలిపారు.  ఇప్పటి వరకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని కోరుతూ విద్యార్థులెవరూ తమను సంప్రదించలేదని పేర్కొన్నారు. గత నెలలో ఇంటర్‌ ద్వితీయ ఏడాది విద్యార్థులకు మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. కరోనా బారినపడ్డ విద్యార్థులను పరీక్షకు అనుమతించమని, వారికి ప్రత్యేకంగా పరీక్షలను నిర్వహిస్తామని అప్పట్లో ఇంటర్‌బోర్డు ప్రకటించింది.  

Updated Date - 2021-11-24T13:55:52+05:30 IST