బిల్లులు వెనక్కి తీసుకునేంత వరకూ చర్చల్లేవు: బాదల్

ABN , First Publish Date - 2020-09-20T01:28:57+05:30 IST

వ్యవసాయ బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకునేంత వరకూ చర్చల ప్రసక్తే లేదని శిరోమణి అకాలీదళ్..

బిల్లులు వెనక్కి తీసుకునేంత వరకూ చర్చల్లేవు: బాదల్

న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకునేంత వరకూ చర్చల ప్రసక్తే లేదని శిరోమణి అకాలీదళ్ (సాద్) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అన్నారు. రైతుల అనుకూల పార్టీ 'సాద్' అనీ, రైతుల పోరాటానికి మద్దతుగా నిలుస్తామని చెప్పారు.


'మేము ఇప్పుడు పంజాబ్ వెళ్తున్నాం. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం జరుపుతాం. శిరోమణి అకాలీదళ్ రైతుల పార్టీ అయినందున వారి తరఫున పోరాటం చేస్తాం. బిల్లులు వెనక్కి తీసుకునేంత కేంద్రంతో చర్చల మాటే లేదు' అని  మీడియాకు బాదల్ తెలిపారు. సాద్ నేత మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ, వ్యవసాయ బిల్లులపై పార్టీ నిర్ణయం ప్రశంసించదగినదని అన్నారు. రైతులకు బాసటగా బిల్లులను వ్యతిరేకించిన సుఖ్‌బీర్ సింగ్ బాదల్, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌ను ఆయన అభినందించారు. కేంద్రంలో ఎన్డీయేకు 'సాద్' చిరకాల భాగస్వామిగా ఉంటోంది.

Updated Date - 2020-09-20T01:28:57+05:30 IST