తెలంగాణలో టీడీపీ లేదు: మెచ్చా నాగేశ్వర్ రావు

ABN , First Publish Date - 2021-04-07T23:32:39+05:30 IST

తెలంగాణ రాష్ర్టంలో టీడీపీ లేదని ఆ పార్టీ తరపున అశ్వరావుపేట ఎమ్మెల్యేగా గెలిచిన

తెలంగాణలో టీడీపీ లేదు: మెచ్చా నాగేశ్వర్ రావు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ లేదని ఆ పార్టీ తరపున అశ్వరావుపేట ఎమ్మెల్యేగా గెలిచిన మెచ్చా నాగేశ్వర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసిని అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల కోసం, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు, మా ప్రాంత అభివృద్ధికి సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకు వెళ్లాలని తమను సీఎం కేసీఆర్ ఆదేశించారని ఆయన తెలిపారు.


Updated Date - 2021-04-07T23:32:39+05:30 IST