ముషీరాబాద్లో వ్యాక్సిన్ కొరత.. నిరాశతో వెనుదిరిగిన ప్రజలు
ABN , First Publish Date - 2021-04-13T17:10:23+05:30 IST
ముషీరాబాద్, భోలక్పూర్ యూపీహెచ్సీలో కరోనా వ్యాక్సిన్ లేకపోవడంతో
హైదరాబాద్/ముషీరాబాద్ : ముషీరాబాద్, భోలక్పూర్ యూపీహెచ్సీలో కరోనా వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. సోమవారం టీకా కోసం వందలాది మంది వచ్చారు. వ్యాక్సిన్ కొరత వల్ల వేయలేకపోతున్నామని సిబ్బంది చెప్పి పంపించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు వ్యాక్సిన్ వస్తుందని వైద్యాధికారి డాక్టర్ కృష్ణమోహన్ తెలిపారు. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో 112 మంది జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేశారు.