2021 మానవ జాతి అంతమేనా.. నోస్ట్రడామస్ భవిష్యవాణి ఏం చెబుతోంది..?

ABN , First Publish Date - 2021-01-09T17:09:55+05:30 IST

దుర్మార్గుడైన హిట్లర్ నియంతృత్వం గురించి రాసుకొచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడి హత్య గురించి ముందుగానే చెప్పారు. 9/11 ట్విన్ టవర్స్ ఎటాక్, అమెరికాలోని అతిపెద్ద భూకంపం ఇలా అనేక విషయాల..

2021 మానవ జాతి అంతమేనా.. నోస్ట్రడామస్ భవిష్యవాణి ఏం చెబుతోంది..?

ఇంటర్నెట్ డెస్క్: దుర్మార్గుడైన హిట్లర్ నియంతృత్వ ధోరణిని ముందుగానే ఊహించారు. అమెరికా మాజీ అధ్యక్షుడి హత్య గురించి ముందుగానే హెచ్చరించారు. 9/11 ట్విన్ టవర్స్ ఎటాక్, అమెరికాలోని అతిపెద్ద భూకంపం ఇలా అనేక విషయాల గురించి ఏకంగా 465 ఏళ్ల క్రితమే తన భవిష్యవాణిలో చెప్పారు ఫ్రెంచ్ ఫిలాసఫర్ నోస్ట్రడామస్. వీటితో పాటు 2020లో ఓ గుర్తు తెలియని మహమ్మారి విజృంభించి కోట్ల మంది ప్రాణాలను బలిగొంటుందన విషయం కూడా ఆయన భవిష్యవాణిలో ఉంది. దాని ప్రకారమే కరోనా వచ్చింది. ఇంత వరకు ఒక ఎత్తయితే.. 2020తో పోల్చితే 2021 మరింత భయానకంగా ఉంటుందని నోస్ట్రడామస్ భవిష్యవాణిలో ఉండడమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.


2020-21కి సంబంధించి ఆయన చెప్పిన జోస్యంలో.. ‘వర్షం, రక్తం, పాలు, కరువు, దొంగతనాలు, ఓ మహమ్మారి అనేవి విజృంభిస్తాయి. వీటిబారిన పడి కోట్ల మంది చనిపోతారు. తల్లులు, తండ్రులు మరణిస్తారు. బతికున్న వారు సగం చనిపోయిన వారిలా మిగిలిపోతారు. వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయి. ఆకాశం ఎర్రగా మారుతుంది. కాంతివంతమైన తోక కలిగిన ఓ కిరణం విశ్వం నుంచి భూమికి చేరుతుంది. ఎక్కడ చూసినా కరువు ఏర్పడుతుంది’ అంటూ 20వ శతాబ్దానికి సంబంధించి ఆయన భవిష్యవాణి చెప్పారు.


కరోనా తరువాత ప్రపంచవ్యాప్తంగా కఠినమైన కరువు పరిస్థితులు ఏర్పడతాయని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఇక ప్యారిస్‌లోని ఐఫిల్ టవర్ సైజులో ఉన్న ఓ భారీ ఉల్క భూమి వైపు దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఇది భూమిడి ఢీకొట్టే అవకాశం చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. అది భూమిని దాటే వరకు ప్రమాదం పొంచి ఉన్నట్లేనని చెబుతున్నారు. ఇక సౌర తుఫానులు కూడా ఈ ఏడాది ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు వచ్చాయి. ఈ మార్పుల వల్ల భూమి భ్రమణ వేగం కూడా పెరిగింది.


నోస్ట్రడామస్ చెప్పిన దాని ప్రకారం.. 2020తో పోల్చితే 2021 మరింత భయానకంగా ఉండే అవకాశం కనపడుతోంది. అయితే 2020లో విజృంభించిన కరోనాను మానవజాతి దాదాపు జయించినట్లే చెప్పాలి. వ్యాక్సిన్ కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. ఇక భూమికి చేరువగా వస్తున్న ఉల్క కూడా భూమిని ఢీకొనే అవకాశం 40వేలల్లో ఒక్క శాతం కంటే తక్కువ మాత్రమే ఉంది. కరువు పరిస్థితులను తట్టుకోవడానికి ప్రపంచ దేశాలు కూడా ఒక్కటై పోరాడేందుకు, సహాయసహకారాలూ అందించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అంటే ఈ ప్రమాదాలను మనం జయించే అవకాశం ఉంది.

Updated Date - 2021-01-09T17:09:55+05:30 IST