ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్కు ఎంపిక
ABN , First Publish Date - 2021-01-26T05:59:54+05:30 IST
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్కు ఎంపిక
(ఆంధ్రజ్యోతి, మేడ్చల్జిల్లా ప్రతినిధి): మేడ్చల్మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లికి చెందిన చదలవాడ హిమేష్ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్కు ఎంపికయ్యాడు. ఇ-ఆల్జీమర్స్ వ్యాధి ఉన్న వారి ఆరోగ్య పరిరక్షణకు స్మార్ట్వాచ్ కనిపెట్టిన హిమేష్ ఈ అవార్డుకు ఎంపిక కాగా సోమవారం మేడ్చల్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ విద్యాసాగర్ విద్యార్థిని అభినందించారు. మంగళవారం ఢిల్లీలో పురస్కారాన్ని అందుకోనున్నట్లు తెలిపారు. సోమవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలల పురస్కారానికి ఎంపికైన పలురాష్ట్రాలకు చెందిన 32జిల్లాలకు చెందిన విద్యార్థులను అభినందించారు.