చెరువు కాదు.. ఇళ్ల స్థలమే!
ABN , First Publish Date - 2020-07-10T09:30:46+05:30 IST
వీళ్లు వలలు వేసి చేపలు పడుతున్న ఈ భూములను పెదవాగు పరిసరాల్లో పేదింటి స్థలాల కోసం అధికారులు సేకరించారు. పశ్చిమగోదావరి జిల్లా
వీళ్లు వలలు వేసి చేపలు పడుతున్న ఈ భూములను పెదవాగు పరిసరాల్లో పేదింటి స్థలాల కోసం అధికారులు సేకరించారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం బందపురంలో ఎంపిక చేసిన ఈ భూముల్లో లేఅవుట్లు వేసి, రాళ్లు పాతి పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. ఇంతలో గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు పొంగిన వాగులో అవన్నీ కొట్టుకుపోయాయి. ఈ భూములకు ఎకరానికి రూ. 30-40 లక్షల చొప్పున ఐదు ఎకరాలను కొని మరీ చదును చేయించారు. చెరువును తలపిస్తున్న ఈ ప్రాంతంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు గురువారం చేపలు పట్టి నిరసన తెలిపారు. గోపాలపురం మండలంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ ‘పేదింటి’ స్థలాలు మునిగాయి. - దేవరపల్లి/ గోపాలపురం