వారు దేశంలో ఉండేందుకు అనర్హులు
ABN , First Publish Date - 2020-04-05T17:55:41+05:30 IST
కరోనా వైరస్ను వ్యాప్తి చేసేవారు..
రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్
కర్నూలు(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ను వ్యాప్తి చేసేవారు దేశంలో ఉండడానికి అనర్హులని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేశ్ అన్నారు. ఢిల్లీ జమాత్కు పోయివచ్చిన వారు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉన్నారని, వీరి ద్వారానే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని ఆయన అన్నారు. అంతకు ముందు మత కల్లోలాలు జరిగిన ఢిల్లీలోనే మత సమావేశాలకు ఎలా అనుమతించారని ఆయన ప్రశ్నించారు. కరోనాను ఎదుర్కోవడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రపంచ దేశాలన్నీ కొనియాడుతున్నాయన్నారు. దానిని అభినందించకుండా దీపాలు వెలిగించాలనడం మీద రాద్ధాంతం చేయడం తగదని అన్నారు. కరోనా వ్యాప్తి కారణమైనవారు దేశంలో ఉండేందును అనర్హులని అన్నారు.