లేదనడం లేదు.. ప్యాకేజీపై నిర్మల సీతారామన్

ABN , First Publish Date - 2020-10-20T22:51:13+05:30 IST

ప్యాకేజీల ప్రకటన మరోమారు ఉండబోతోందా ? అంటే... ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సంకేతాలే ఈ చర్చకు దారితీశాయి. కరోనా మహమ్మారి నేపధ్యంలో క్షీణించిన ఆర్థికవ్యవస్థకు ఊతమిచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. పదిహేనవ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్ రాసిన పుస్తకావిష్కరణ సభ సందర్భంగా మాట్లాడుతూ... మరో ఆర్థిక ప్యాకేజీ సంకేతాలనిచ్చారు నిర్మల. 2020-21 ఆర్థిక సంవత్సరంపై కరోనా తీవ్ర ప్రభావం నేపథ్యంలో కొత్తగా వృద్ధి, బడ్జెట్ ఎఅంచనాలతో వస్తామన్నారు.

లేదనడం లేదు.. ప్యాకేజీపై నిర్మల సీతారామన్

న్యూఢిల్లీ : ప్యాకేజీల ప్రకటన మరోమారు ఉండబోతోందా ? అంటే... ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సంకేతాలే ఈ చర్చకు దారితీశాయి. కరోనా మహమ్మారి నేపధ్యంలో క్షీణించిన ఆర్థికవ్యవస్థకు ఊతమిచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. పదిహేనవ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్ రాసిన పుస్తకావిష్కరణ సభ సందర్భంగా మాట్లాడుతూ... మరో ఆర్థిక ప్యాకేజీ సంకేతాలనిచ్చారు నిర్మల. 2020-21 ఆర్థిక సంవత్సరంపై కరోనా తీవ్ర ప్రభావం నేపథ్యంలో కొత్తగా వృద్ధి, బడ్జెట్ ఎఅంచనాలతో వస్తామన్నారు.


'మరో ఉద్దీపన ప్యాకేజీ లేదని చెప్పడం లేదు' అని పేర్కొన్నారు. తాము ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన ప్రతిసారి ఎన్నో విధాలుగా చర్చలు జరిపి, నిర్దిష్ట వర్గాల వారికి ప్రయోజనం కలిగేలా చూస్తున్నామన్నారు. ఇదే క్రమంలో... అవసరమైతే మరో ఉద్దీపన ప్యాకేజీకి తలుపులు తెరిచే ఉంటాయన్నారు.

Updated Date - 2020-10-20T22:51:13+05:30 IST