Kolkata: ప్రముఖ బెంగాలీ రచయిత బుద్ధదేబ్ గుహ కన్నుమూత

ABN , First Publish Date - 2021-08-30T14:53:57+05:30 IST

ప్రముఖ బెంగాలీ రచయిత బుద్ధదేవ్ గుహ కోల్‌కతా ఆసుపత్రిలో కన్నుమూశారు....

Kolkata: ప్రముఖ బెంగాలీ రచయిత బుద్ధదేబ్ గుహ కన్నుమూత

కోల్‌కతా(పశ్చిమబెంగాల్):ప్రముఖ బెంగాలీ రచయిత బుద్ధదేవ్ గుహ కోల్‌కతా ఆసుపత్రిలో కన్నుమూశారు. 85 ఏళ్ల గుహ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన గుహ అడవులు, ప్రకృతిపై పలు నవలలు, కథలు రాశారు. బెంగాలీ సాహిత్యంలో గుహ రాసిన మధుకోరి అనే నవల మైలురాయిగా నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో గుహ కరోనా బారిన పడి నెలరోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. అనంతరం ఊపిరితిత్తులు, మూత్ర మార్గ సమస్యలతో గుహ మళ్లీ ఆసుపత్రిలో చేరారు. కొవిడ్ అనంతర సమస్యలతో గుహకు గుండెపోటు వచ్చి ఆదివారం రాత్రి కన్నుమూశారు. గుహ మృతి బెంగాలీ సాహిత్యరంగానికి తీరని లోటని పలువురు విడుదల చేసిన సంతాప సందేశాల్లో పేర్కొన్నారు.

Updated Date - 2021-08-30T14:53:57+05:30 IST