అమెజాన్ ఇండియాకు... నోటీస్...

ABN , First Publish Date - 2021-01-14T00:20:57+05:30 IST

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాకు జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ నుంచి నోటీసు జారీ అయ్యింది. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్(ఐటీసీ)కు సంబంధించి తప్పుడు దావాపై కంపెనీ ఆరోపణలు చేసింది. వ్యాపారవర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

అమెజాన్ ఇండియాకు... నోటీస్...

వాషింగ్టన్ : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాకు జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ నుంచి నోటీసు జారీ అయ్యింది. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్(ఐటీసీ)కు సంబంధించి తప్పుడు దావాపై కంపెనీ ఆరోపణలు చేసింది. వ్యాపారవర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. 


అమెజాన్ ఇండియాకు జీఎస్టీ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ రూ.175 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసు జారీ చేసింది. బెంగళూరులోని అమెజాన్‌ ఇండియా కార్యాలయానికి నోటీసు పంపిన డీజీజీఐ అధికారులు... వారివ్వనున్న  సమాధానం ఆధారంగా తర్వాతి చర్యలు తీసుకోనున్నట్లు వినవస్తోంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.  


అమెజాన్ ఇండియా లెక్కల్లో లోపాలున్నట్లు డీజీజీఐ దర్యాప్తులోగుర్తించారు. జీఎస్టీ చెల్లించిందంటూ తొలుత చెప్పిన అమెజాన్... తరువాత వాపసును తప్పుగా క్లెయిమ్ చేయడం ప్రారంభించిందని ఆ నోటీసులో పేర్కొన్నారు. 


అమెజాన్ ఇండియాకు పంపిన నోటీసులో బకాయిల గురించి డీజీజీఐ ప్రశ్నించారు. పన్ను లీకేజీలను అరికట్టడానికి జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం దేశవ్యాప్తంగా డ్రైవ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-01-14T00:20:57+05:30 IST