ఇంట్లోనే పాటిల్‌కి టీకా.. సిబ్బందికి నోటీసులు

ABN , First Publish Date - 2021-03-04T07:16:14+05:30 IST

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కర్ణాటక వ్యవసాయ మంత్రి బీసీ పాటిల్‌ ఇంట్లోనే కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడం వివాదాస్పదమైంది

ఇంట్లోనే పాటిల్‌కి టీకా.. సిబ్బందికి నోటీసులు

బెంగళూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కర్ణాటక వ్యవసాయ మంత్రి బీసీ పాటిల్‌ ఇంట్లోనే కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడం వివాదాస్పదమైంది. టీకా వేసిన సిబ్బందికి బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై కేంద్రానికి నివేదిక పంపారు. 

Updated Date - 2021-03-04T07:16:14+05:30 IST