కోర్టుల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దు
ABN , First Publish Date - 2021-06-19T05:24:54+05:30 IST
జిల్లాలోని కోర్టుల్లో పలు పోస్టులకు గతంలో విడుదలైన నోటిఫికేషన్ రద్దయినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబు తెలిపారు.
పూతలపట్టు, జూన్ 18: జిల్లాలోని కోర్టుల్లో పలు పోస్టులకు గతంలో విడుదలైన నోటిఫికేషన్ రద్దయినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబు తెలిపారు. జిల్లాలోని పలు కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం 2015లో నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పట్లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది. అయితే ఆ నోటిఫికేషన్ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రద్దు చేస్తున్నట్లు జిల్లా జడ్జి పేర్కొన్నారు.