ఎన్పీఆర్, మొదటి దశ జనగణన వాయిదా
ABN , First Publish Date - 2020-03-26T09:26:56+05:30 IST
కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)...
హైదరాబాద్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), 2021 మొదటి దశ జనగణనను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు జనగణన 2021ని రెండు దశల్లో చేపట్టాలని ఇంతకుముందు నిర్ణయించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ వాయిదా వేశారు.