విపత్కర పరిస్థితుల్లో.. పేదలకు అండగా నిలిచిన ఎన్నారై!

ABN , First Publish Date - 2020-04-03T23:59:34+05:30 IST

కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు ఇప్పటికే నడుం బిగించాయి. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం కూడా

విపత్కర పరిస్థితుల్లో.. పేదలకు అండగా నిలిచిన ఎన్నారై!

హైదరాబాద్: కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు ఇప్పటికే నడుం బిగించాయి. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న పేదలు గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చేతిలో పని లేకపోవడంతో తినడానికి తిండి దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న అమర్నాథ్ మన్నావా.. అమెరికాలోని అతని స్నేహితుల సహకారంతో పేదలకు అండగా నిలిచారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలో బస్తీలో నివసిస్తున్న పేద ప్రజలకు ఆహారం, నిత్యాసర సరుకులు అందజేశారు. అంతేకాకుండా ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.  


Updated Date - 2020-04-03T23:59:34+05:30 IST