ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

ABN , First Publish Date - 2020-05-28T23:20:35+05:30 IST

నందమూరి తారక రామారావు 97వ జయంతి సందర్భంగా ఎన్నారై

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

వట్టిచెరుకూరు: నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని చామళ్లమూడి గ్రామంలో కొవిడ్-19 కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు ఎన్నారై టీడీపీ నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది. వట్టిచెరుకూరుకు చెందిన ధరనేష్ యడ్లపల్లి, రామ్ చౌదరి అనే ఎన్నారైలు ఆర్థిక సాయాన్ని పంపగా.. స్థానిక నేతలు నిత్యావాసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఎన్టీఆర్‌కు తిరుగులేదని.. ఆయన జయంతి సందర్భంగా నిత్యవసరాలను పంపిణీ చేయడం ఆనందంగా ఉందని ఎన్నారై టీడీపీ సభ్యులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వారు చెప్పారు. నందిగామ, విజయవాడ, అమరావతి, గుంటూరు, ప్రత్తిపాడు, మదనపల్లి, సింగనమల, రాజంపేట, ప్రొద్దుటూరు, ఆధోని, పెదకాకాని, ఒంగోలు, పర్చూరు, అద్దంకి, విజయనగరం, మాడుగుల(విశాఖ), నర్సీపట్నం, రాజాం, తణుకు, రాజమండ్రి, నెల్లూరు, ఉరవకొండ, తిరుపతిలలో నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్టు ఎన్నారై టీడీపీ సభ్యులు పేర్కొన్నారు. 


ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి

Updated Date - 2020-05-28T23:20:35+05:30 IST