ఎమ్మెల్సీ కవితపై బీజేపీ చేసిన ఆరోపణలను ఖండించిన ఎన్నారై టీఆర్ఎస్
ABN , First Publish Date - 2021-02-24T17:50:43+05:30 IST
ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ యూనియన్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై చేసిన ఆరోపణలను బీజేపీ అధికార ప్రతినిధి తరుణ్ చుగ్ ఉపసంహరించుకోవాలని
హైదరాబాద్: ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ యూనియన్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై చేసిన ఆరోపణలను బీజేపీ అధికార ప్రతినిధి తరుణ్ చుగ్ ఉపసంహరించుకోవాలని ఎన్నారై టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. తెలంగాణ పర్యటనలో భాగంగా శ్రీరాంపూర్లో తరుణ్ చుగ్ చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని కవితకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఎన్నారై టీఆరెస్ సభ్యులు ఆకుల శ్యామ్ డిమాండ్ చేశారు. శ్యామ్ మాట్లాడుతూ.. సింగరేణిని అవినీతిమయం చేశారన్న ఆరోపణలను తరుణ్ చుగ్ నిరూపించాలని, లేని పక్షంలో తెలంగాణలో ఆయనను తిరగనీయమని హెచ్చరించారు. టీఆరెస్ పార్టీపై, కవితపై లేనిపోని ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీని చిత్తుగా ఓడిస్తారని అన్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులందరూ టీఆఎస్ పార్టీకి ఓటు వేయాలని ఆకుల శ్యామ్ విజ్ఞప్తి చేశారు.