టీఆర్ఎస్ చేపట్టిన రైతు ధర్నా విజయవంతానికి ఎన్నారైల విజ్ఞప్తి

ABN , First Publish Date - 2021-11-12T00:20:20+05:30 IST

రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నవంబర్ 12న నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్న విషయం ప్రజలందరికీ తెలు

టీఆర్ఎస్ చేపట్టిన రైతు ధర్నా విజయవంతానికి ఎన్నారైల విజ్ఞప్తి

ఎన్నారై డెస్క్: రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నవంబర్ 12న నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసు అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపడుతున్న ధర్నా కార్యక్రమాల్లో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. దీని ద్వారా మరొక్కసారి తెలంగాణ సత్తా ఢిల్లీకి తెలియజేయాలని అనిల్ కూర్మాచలం అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎన్నారైలు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఎన్నారైలు ఉండి.. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు అవుతారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎన్నారైలు డిమాండ్ చేశారు.




Updated Date - 2021-11-12T00:20:20+05:30 IST